ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

author img

By

Published : Jan 15, 2021, 9:00 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. రాష్ట్ర వ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్‌

దాదాపు పది నెలల కాలంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి విరుడుగు ఇచ్చే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 139 ప్రభుత్వ ఆస్పత్రులో వాక్సినేషన్ సెంటర్స్​ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'మొదటి డోసు నేనూ తీసుకుంటా'

రేపు రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాను టీకా తీసుకుంటానని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తొలి, రెండో, మూడో విడత పరీక్షల అనంతరమే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'కేంద్రం సిద్ధంగా ఉంది'

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎస్ సోమేశ్​ కుమార్​ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు మద్దతు ధర కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్​ను కోరినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అఖిల ఫోన్లు ఎక్కడున్నాయి?

ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 19న మరోసారి భేటీ!

కేంద్రం, రైతుల మధ్య జరిగిన 9వ విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు మరోసారి డిమాండ్​ చేశాయి. అయితే.. చర్చల ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వయసు 22 ఏళ్లు..పెళ్లిళ్లు 11!

ఫేస్​బుక్​ ద్వారా అతనితో ఏర్పడిన పరిచయాన్ని ఆమె వివాహ బంధంగా మార్చుకుంది. తల్లిదండ్రులను కాదని అతనితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైంది. కానీ తర్వాతే తెలిసింది అతడో నిత్యపెళ్లికొడుకని. నిందితుడిని తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారత్​, నేపాల్​ చర్చలు

భారత్​-నేపాల్​ జాయింట్​ కమిషన్ 6వ​ సమావేశం(జేసీఎం) దిల్లీలో జరిగింది. సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, రవాణా, కొవిడ్​ సహకారం వంటి పలు అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బైడెన్​ 'రిహార్సల్'​ వాయిదా!

అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారానికి ముందు అమెరికాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోసారి నిరసనకారుల నుంచి ముప్పు పొంచి ఉందని ఎఫ్​బీఐ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఫ్రాంచైజీలకు సూచన

ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానాన్ని జనవరి 20లోగా ఫ్రాంచైజీలు పూర్తి చేయాలని గవర్నింగ్ కౌన్సిల్​ తెలిపింది. ఐపీఎల్​ వేలంలో పాల్గొనాలనే కొత్త ఆటగాళ్లు ఫిబ్రవరి 4లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. జపనీస్​లో 'మిషన్ మంగళ్'

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'మిషన్ మంగళ్', 'దేవినేని', 'బంగారు బుల్లోడు', 'జాంబీ రెడ్డి', 'క్రేజీ అంకుల్స్' చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.