ETV Bharat / business

Gold Price: స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర.. ప్రస్తుతం ఎంతంటే?

author img

By

Published : Aug 10, 2022, 11:52 AM IST

GOLD PRICE
GOLD PRICE

Gold Price Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.54 వేల మార్క్​ దిగువన ట్రేడవుతోంది. మరోవైపు, కేజీ వెండి రూ.500 తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం వెండి ధర రూ.60వేల వద్ద కదలాడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,990గా ఉంది. కిలో వెండి ధర రూ.59,980 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,990 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60 వేలుగా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,990గా ఉంది. కేజీ వెండి ధర రూ.60 వేల వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,990గా ఉంది. కేజీ వెండి ధర రూ.60 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,789 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.39 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:
బిట్​కాయిన్ విలువ రూ.34,099 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,60,000 పలుకుతోంది. ఇథీరియం రూ.8,600 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.1,44,230 వద్ద కొనసాగుతోంది.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.19,60,000
ఇథీరియంరూ.1,44,230
టెథర్రూ.84.91
బినాన్స్​ కాయిన్రూ.24,962
యూఎస్​డీ కాయిన్రూ.85.54

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగియడం... ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు సైతం స్తబ్దుగా ఉన్నాయి. అమెరికాలో మంగళవారం ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ప్రధానంగా దానిపై దృష్టి సారించాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 58,790 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 17,514 వద్ద కదలాడుతోంది.

రూపాయి
బుధవారం రూపాయి కాస్త కోలుకుంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో 11 పైసలు లాభపడింది. ప్రస్తుతం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 79.52కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.