స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్(Sensex today) 359 పాయింట్లు పెరిగి 52,300 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 102 పాయింట్ల లాభంతో 15,738 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, లోహ, ఐటీ షేర్లు జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బజాజ్ ఫినాన్స్ జంట షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,346 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,957 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,751 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,648 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
బజాజ్ ఆటో, మారుతీ, పవర్గ్రిడ్, హెచ్సీఎల్టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. హాంగ్సెంగ్ సూచీ నష్టాలతో ముగిసింది.
ఇదీ చదవండి:Covid effect: కార్ల విక్రయాలు 59శాతం డౌన్!