ETV Bharat / business

ఆ బ్యాంకులకు ఆర్​బీఐ షాక్- రూ.కోటికి పైగా జరిమానా​!

author img

By

Published : Dec 15, 2021, 8:55 PM IST

Rbi Penalty on Banks: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆర్​బీఐ భారీ జరిమానా విధించింది. నియంత్రణపరమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకే ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

rbi penalty
జరిమానా

RBI Penalty on Banks: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ఆర్​బీఐ భారీ జరిమానా విధించింది. నియంత్రణపరమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకే ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది. 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టింది. పలు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు రికార్డులు ఉన్నట్లు గుర్తించింది.

  • పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించకుండా.. జరిమానాలు విధింపుపై ఆర్​బీఐ ఆదేశాలను పాటించని కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్​కు రూ.30 లక్షల జరిమానా విధించింది ఆర్​బీఐ.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు(RBI penalty PNB) రూ.కోటి 80 లక్షలు జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఆర్‌బీఐ). బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 సెక్షన్-19ని ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.

ఈ రెండింటింకీ విధించిన జరిమానాలు పలు లోపాల ఆధారంగానే ఉన్నాయని.. ఖాతాదారుల లావాదేవీలకు వీటితో సంబంధం ఉండదని ఆర్​బీఐ పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.