ETV Bharat / bharat

తక్కువ ధరకే 'మ్యాంగో వైన్'​.. ఎక్సైజ్​ శాఖ కొత్త ప్లాన్​

author img

By

Published : Jan 9, 2022, 3:51 PM IST

Mango Wine: అక్కడి ఎక్సైజ్​ శాఖ వినూత్న రీతిలో ఆలోచించింది. రాష్ట్ర ప్రజలకు మ్యాంగో వైన్​ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపింది.

mango wine
mango wine

Mango Wine: ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలకు త్వరలో మ్యాంగో వైన్​ అందుబాటులోకి రాబోతుంది. అవును మీరు విన్నది నిజమే. ఇందుకోసం ప్రత్యేకంగా మద్యం విధానాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది ఎక్సైజ్​ శాఖ. 1974 తర్వాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని సవరించాల్సి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

mango wine
నోరూరించే మ్యాంగో వైన్​

వైన్​ తయారీ యూనిట్లను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్​ శాఖ చెబుతోంది. రూ. 70 లక్షలతో ఒక యూనిట్​ ఏర్పాటవుతుందని అంచనా. ఇతరత్రా వాటికి అయితే.. మద్యాన్ని వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు.

Lack of Production of Grapes

సాధారణంగా వైన్​ తయారీకి గ్రేప్స్​(ద్రాక్ష పండ్లు) ఉపయోగిస్తారు. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​లో ద్రాక్ష ఉత్పత్తి ఆశించినంత లేదు. అందుకే వినూత్నరీతిలో ఆలోచించిన ఎక్సైజ్​ శాఖ.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇతర పండ్ల నుంచి వైన్​ తయారుచేయాలని భావించింది.

mango wine
మ్యాంగో వైన్​

Mango Wine Using Dussehri Mangoes: దేశంలోనే మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​కు మంచి పేరుంది. యూపీలోని మలిహాబాద్​లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దశ్​హరీ మామిడిని పండిస్తారు. ఈ మామిడి పండ్లనే వైన్​ తయారీకి ఉపయోగించనున్నట్లు ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.

mango wine
మ్యాంగో వైన్​- యూపీ ఎక్సైజ్​ శాఖ వినూత్న నిర్ణయం

వైన్​ పాలసీని సవరించడం రైతులకు లాభదాయకం అని చెబుతున్నారు ఎక్సైజ్​ అధికారులు. ఇకపై రైతులు.. మామిడి పండ్లను ప్రభుత్వానికి నేరుగా విక్రయించవచ్చని అంటున్నారు.

ఇవీ చూడండి: ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు

రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ- అన్నదమ్ములు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.