ETV Bharat / bharat

మత్తుమందు ఇచ్చి బాలికపై తాంత్రికుడు అత్యాచారం

author img

By

Published : Mar 26, 2021, 4:54 PM IST

Updated : Mar 26, 2021, 5:22 PM IST

అనారోగ్యంగా ఉందని ఓ మాంత్రికుడిని ఆశ్రయిస్తే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బస్తీ జిల్లాలో జరిగింది.

tantrik-raped-teenager-for-treatment-by-tantra-mantra-in-basti
అనారోగ్యంతో వెళ్తే బాలికపై తాంత్రికుడు అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో క్షుద్రపూజల నెపంతో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్​పై అత్యాచార, పోక్సో చట్టాల కింద గౌరా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..

ఈ నెల 22న రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలి తల్లి తాంత్రికుడి దగ్గరకు తీసుకుపోయింది. చికిత్స పేరిట చిన్నారికి మత్తు మందు ఇచ్చాడు ఆ వ్యక్తి. అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

అధిక రక్తస్రావం కావడం చూసిన తల్లి బాధితురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది.

ఇదీ చూడండి: ప్రేయసి తల్లి, చెల్లిని హత్యచేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

Last Updated :Mar 26, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.