ETV Bharat / bharat

అమరావతిలో ఘోర ప్రమాదం.. భవనం కూలి ఐదుగురు మృతి

author img

By

Published : Oct 30, 2022, 4:36 PM IST

Updated : Oct 30, 2022, 4:53 PM IST

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్​ చౌక్​లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

amravati building collapse
amravati building collapse

మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్​ చౌక్​లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగిందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్​ సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం కూలిపోయే స్థితికి చేరుకుందని.. వెంటనే ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోలేదని మున్సిపల్​ అధికారులు తెలిపారు. గత ఏడేళ్లుగా నోటీసులు అనేక సార్లు నోటీసులు జారీ చేసినా.. కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు.

ఇవీ చదవండి: 'అధ్యక్ష తరహా పాలన వైపు దేశం.. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి'

'జర్నలిస్టులకు నగదు పంపలేదు.. ఇదంతా కాంగ్రెస్ టూల్​కిట్ ప్రచారమే'

Last Updated :Oct 30, 2022, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.