ETV Bharat / bharat

గన్​తో బెదిరించి రేప్​.. పెళ్లి చేసుకొని రూ.5 లక్షలు, బైక్​ డిమాండ్​​​!

author img

By

Published : May 20, 2022, 4:42 PM IST

rape
గన్​తో బెదిరించి రేప్

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గన్​తో బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. పంచాయతీ తీర్పు ప్రకారం బాధితురాలిని పెళ్లి చేసుకుని.. రూ.5 లక్షల కట్నం, బైక్​ ఇస్తేనే వివాహం రిజిస్టర్​ చేసేందుకు ఒప్పుకుంటానని మొండి కేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగి.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఈ సంఘటన ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లాలో జరిగింది.

గన్​తో బెదిరించి ఇంట్లో నిద్రిస్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు. పంచాయతీ తీర్పు ప్రకారం బాధితురాలిని పెళ్లి చేసుకుని.. రూ.5 లక్షల కట్నం, ద్విచక్రవాహనం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవ తలెత్తి వ్యవహారం పోలీస్​ స్టేషన్​కు చేరిన సంఘటన ఉత్తరాఖండ్​ రూడ్కీ జిల్లాలోని మంగ్లౌర్​​ కొత్వాలీ ప్రాంతంలో వెలుగు చూసింది.

ఇదీ కథ: మంగ్లౌర్​ కొత్వాలీ ప్రాంతానికి చెందిన యువతి తల్లిదండ్రులు ఏప్రిల్​ 13న వైద్యం కోసం రిషికేశ్​ ఎయిమ్స్​కు వెళ్లారు. అర్ధరాత్రయినా తిరిగి రాలేదు. దీంతో తన సోదరుడు, సోదరితో కలిసి వరండాలో నిద్రపోయింది బాధితురాలు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక తనపై జరిగిన అఘాయిత్యం గురించి వారికి చెప్పింది బాధితురాలు. ఆ వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు ఆమె కుటుంబ సభ్యులు. మొజ్జిజ్​ కమ్యూనిటీకి చెందిన పెద్దలు పంచాయతీ నిర్వహించి.. ఇరువురికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. మే 16న వారి వివాహం జరిపించారు. మే 17న పెళ్లిని రిజిస్టర్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు, ద్విచక్రవాహనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై బాధితురాలి బంధువులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. నిందితుడి కుటుంబ సభ్యులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో యువతి బంధువులకు గాయాలయ్యాయి.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి కుటుంబ సభ్యుల్లోని 8 మంది దానీశ్​, రాఫా, ఇద్రీస్​, పప్పూ, ఫరూక్​, నాజీమ్​, ప్రమోద్​, అశోక్​​పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును మహిళా ఎస్సై అన్షు చౌదరికి అప్పగించామని మంగ్లౌర్​ కొత్వాలీ ఎస్​ఎస్​ఐ రఫత్​ అలీ తెలిపారు.

నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య: బిహార్​లోని వైశాలీ జిల్లాలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి.. తన నలుగురు పిల్లలతో సహా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాతేపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సుక్కీ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 'సుక్కీ గ్రామానికి చెందిన రంజిత్​ సాహ్నీ భార్య తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు రింకు దేవీగా (35) చిన్నారులు 11 ఏళ్ల కరణ్​ కుమార్​, 8 ఏళ్ల శివానీ కుమారి, నాలుగేళ్ల సలోని కుమారిగా గుర్తించాం.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదీ చూడండి: భార్యతో గొడవ.. సిలిండర్​ పేల్చుకుని భర్త మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు

గాల్లో ఉండగా ఇంజిన్ బంద్.. 'టాటా' ఫ్లైట్​కు తప్పిన పెనుముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.