ETV Bharat / bharat

'ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు'

author img

By

Published : Sep 30, 2021, 11:46 AM IST

Updated : Sep 30, 2021, 12:15 PM IST

జైపుర్​లో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్​ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్​ను(cipet jaipur college) ప్రారంభించారు ప్రధాని మోదీ(pm modi news). అలాగే.. రాజస్థాన్​లోని నాలుగు జిల్లాల్లో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. దేశ ఆరోగ్య రంగంలో మార్పు కోసం నూతన జాతీయ ఆరోగ్య విధానంపై కృషి చేస్తున్నట్లు చెప్పారు. దాని ద్వారా ఒక్క క్లిక్​ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

PM virtually inaugurates CIPET Jaipur
పెట్రో కెమికల్స్​ ఇన్​స్టిట్యూట్​ను ప్రారంభించిన మోదీ

రాజస్థాన్​, జైపుర్​లో ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్​ టెక్నాలజీ ఇన్​స్టిట్యూట్​ను(cipet jaipur college) వర్చువల్​గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news). అలాగే.. బన్​స్వారా, సిరోహి, హనుమాన్​గఢ్​, దౌసా జిల్లాల్లో నిర్మించనున్న నాలుగు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశారు.

PM virtually inaugurates CIPET Jaipur
పెట్రో కెమికల్స్​ ఇన్​స్టిట్యూట్​ను ప్రారంభించిన మోదీ

" కరోనా మహమ్మారి ఆరోగ్య రంగంలో చాలా విషయాలు నేర్పింది. ప్రతి దేశం తమ స్వీయ పద్ధతిలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో నిమగ్నమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బలాన్ని, స్వశక్తిని పెంచుకోవాలని భారత్​ నిర్ణయించింది. దేశ ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నూతన జాతీయ ఆరోగ్య విధానం కోసం కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్​ అభియాన్​ నుంచి ఆయుష్మాన్​ భారత్​ వరకు, ఇప్పుడు ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​ అందులో భాగమే. ఇటీవలే ప్రారంభించిన ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​.. దేశంలోని నలుమూలలకు ఆరోగ్య సేవలను చేరవేస్తుంది. ఒక్క క్లిక్​ దూరంలోనే మంచి ఆసుపత్రులు, ల్యాబ్​లు, ఔషధాలు అందుబాటులో ఉంటాయి. రోగుల మెడికల్​ పత్రాలను సురక్షితంగా భద్రపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సెంట్రల్​ ఇన్​స్టిట్యూట్​​ ఆఫ్​ పెట్రోకెమికల్స్​ ఇంజినీరింగ్​, టెక్నాలజీ(సీఐపీఈటీ): ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పెట్రోకెమికల్స్​ టెక్నాలజీ(ఐపీటీ)ని రాజస్థాన్​ ప్రభుత్వ భాగస్వామ్యంతో.. కేంద్ర రశాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఐపీటీని సితాపుర పారిశ్రామిక ప్రాంతంలోని సెంటర్​ ఫర్​ స్కిల్లింగ్​, టెక్నాలజీ సపోర్ట్​(సీఎస్​టీఎస్​) క్యాంపస్​లో ఏర్పాటు చేశారు. పెట్రో కెమికల్​, అనుబంధ పరిశ్రమల అవసరాల కోసం పని చేయనుంది.

వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియా, రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా వర్చువల్​గా హాజరయ్యారు.

Last Updated :Sep 30, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.