ETV Bharat / bharat

అవినీతిరహిత భారత్​ కోసం అలా చేయాల్సిందే: మోదీ

author img

By

Published : Jan 30, 2022, 12:29 PM IST

Updated : Jan 30, 2022, 12:54 PM IST

amar jawan jyoti
ప్రధాని నరేంద్ర మోదీ

Mann Ki Baat: జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్​ జ్యోతి విలీనంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జ్యోతి విలీనం చేసిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని పేర్కొన్నారు. కోటి మందికిపైగా పిల్లలు తమ మన్​కీ బాత్​ను పోస్టుకార్డుల ద్వారా పంపించారని తెలిపారు. అవినీతి నుంచి భారత్​కు వీలైనంత త్వరగా విముక్తి కలిగించాలని అన్నారు.

Mann Ki Baat: ఇండియా గేట్​ వద్ద ఉన్న అమర జవాన్​ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ సమయంలో వారి కళ్లు చెమర్చాయని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన మన్​కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో మన్​కీ బాత్​ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి.

ఈ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఎందరో మాజీ సైనికులు తనకు లేఖ రాశారన్నారు మోదీ. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్ జ్యోతిని విలీనం చేసి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్లు అయిందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.

వారి మన్​కీ బాత్​ను అలా..

పిల్లలు కూడా తమ మనసులో మాటను పోస్టు కార్డు ద్వారా తెలిపారని.. కోటికి పైగా పిల్లలు పోస్టుకార్డులు పంపినట్లు వెల్లడించారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ఈ పోస్టుకార్డులు దేశ భవిష్యత్తుపై నవతరానికి ఉన్న దృక్పథాన్ని తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమర జవాన్​ జ్యోతి విలీనం జరిగిన యుద్ధ స్మారకాన్ని సందర్శించాలని కోరారు ప్రధాని.

అలా చేస్తే అవినీతి అంతం

అవినీతి చెదపురుగు వంటిదన్నారు మోదీ. దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవినీతి నుంచి భారత్​కు వీలైనంత త్వరగా విముక్తి కలిగించాలని అన్నారు. మన విధులకు ప్రాధాన్యం ఇస్తే అవినీతి ఉండదని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : 'కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందాం'

Last Updated :Jan 30, 2022, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.