ETV Bharat / bharat

ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి సొంతం: మోదీ

author img

By

Published : Oct 21, 2021, 11:37 AM IST

Updated : Oct 21, 2021, 12:20 PM IST

దిల్లీ ఎయిమ్స్​లో ఇన్ఫోసిస్​​ సంస్థకు చెందిన విశ్రామ సదన్​ను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi news). దేశంలో టీకా పంపిణీ 100కోట్ల డోసులు దాటిన క్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడికి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

modi
మోదీ

భారత దేశం 100 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని(india vaccination count) అందుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిదారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఈ ఘనత సాధించేందుకు దోహదపడిన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు(pm modi news). కరోనాపై పోరులో దేశ ప్రజలకు 100కోట్ల టీకాల 'సురక్షిత కవచం' లభించిందన్నారు.

దిల్లీ ఎయిమ్స్​లోని ఎన్​సీఐలో (నేషనల్​ కేన్సర్​ ఇన్​స్టిట్యూట్​) ఇన్ఫోసిస్​ సంస్థకు చెందిన విశ్రామ్​ సదన్​ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించారు మోదీ. ఈ నేపథ్యంలో టీకా 100కోట్ల మైలురాయి ఘనత ప్రతి ఒక్క భారతీయుడి సొంతమని తెలిపారు.

"100 ఏళ్లల్లోనే అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొనే దిశగా.. దేశానికి 100కోట్ల టీకా రక్షణ లభించింది. ఇది ప్రతి భారతీయుడికి సొంతం."

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

దేశ ఆరోగ్యసేవలను మెరుగుపరిచేందుకు భారత్​లోని కార్పొరేటు, ప్రైవేటు రంగాలు, సామాజిక వ్యవస్థలు ఎనలేని కృషిచేస్తున్నాయని కొనియాడారు ప్రధాని. జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడంలో ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర అన్నారు.

రూ. 93 కోట్ల వ్యయంతో విశ్రామ్​ సదన్​ను ఇన్ఫోసిస్​ను నిర్మించింది. అక్కడ భూమి, విద్యుత్​, నీరు ఏర్పాట్లకు ఎయిమ్స్​ ఝజ్జర్​ ఏర్పాట్లు చేసింది. ఇందులో మొత్తం 806 పడకలు ఉంటాయి. కేన్సర్​ బాధితుల కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకునేందుకు ఏసీతో కూడిన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్​​ సిబ్బందిని మోదీ అభినందించారు.

ఇవీ చూడండి:-

Last Updated :Oct 21, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.