ETV Bharat / bharat

Odisha Train Accident : 'ఘోర'మాండల్​ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?

author img

By

Published : Jun 3, 2023, 10:30 PM IST

odisha train acciden
odisha train acciden

Odisha Train Accident : ఒడిశా రైలు దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఏ సమయానికి ఏం జరిగిందంటే?

Odisha Train Accident : ఒడిశాలో మాటలకందని మహా విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా... ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 280 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. చాలామంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఏ క్షణం ఏం జరిగిందనేది అధికారులు ఆరా తీశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Odisha Train Accident Time : శుక్రవారం రాత్రి.. ఎప్పుడేం జరిగింది?

  • 6.50 PM: లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టడం వల్ల అందులోని ప్రయాణికులకు భారీ శబ్ధం వినిపించింది. రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి.
  • 6.55 PM: పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీకొట్టింది.
  • 7.10 PM: ప్రమాదంపై విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.7.30 PM: స్థానిక అధికారులు, పోలీసులు, అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.
  • 8.00-9:00 PM: ఆ తర్వాత బీఆర్‌ సింగ్ ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆర్థోపెడిక్‌, ఈస్ట్రన్‌ రైల్వే ఆస్పత్రి సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
  • 9.30 PM: స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించేందుకు డివిజనల్‌ మేనేజర్‌ బస్సులను ఏర్పాటు చేశారు.
  • 9.59 PM : ముంబయి-గోవా వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

Odisha Train Tragedy: అయితే శనివారం ఉదయం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా ఘటనాస్థలికి వెళ్లారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులు గమనించారు. సాయంత్రం ప్రధాని మోదీ రైలు ప్రమాదస్థలాన్ని పరిశీలించి.. కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటనకు కారకులన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • ओडिशा ट्रेन हादसा: यातायात बहाल करने का कार्य प्रगति पर है। pic.twitter.com/cvlbn5nhzA

    — Ministry of Railways (@RailMinIndia) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్‌కు ప్రమాదం.. రెండు ఒడిశాలోనే!
Odisha Train Crash : అయితే శుక్రవారం నాటి ఘటనతో కలిపి ఇదే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గడిచిన 20 ఏళ్లలో మూడు సార్లు ప్రమాదానికి గురైంది. హవ్‌డా- చెన్నై మధ్య నడిచే ఈ రైలు.. మూడుసార్లూ చెన్నై వెళ్లేటప్పుడే ప్రమాదం జరిగింది. అదీ మూడుసార్లూ శుక్రవారం రోజే ప్రమాదం జరిగింది. ఇందులో రెండుసార్లు ఒడిశాలో, ఒకసారి ఏపీలో జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.