ETV Bharat / bharat

60వేల మంది టీచర్లకు ప్రమోషన్!

author img

By

Published : Jul 31, 2021, 4:33 PM IST

promotion to the primary school teachers
ప్రైమరీ స్కూల్ టీచర్లకు ప్రమోషన్

ప్రైమరీ స్కూల్​ టీచర్లకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగుల రెసిడెన్సీ పిరియడ్​ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. దీంతో 60వేలకు పైగా ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతి లభించనుంది.

ప్రభుత్వ ఉద్యోగుల రెసిడెన్సీ పిరియడ్​ను తగ్గిస్తూ సీఎం నవీన్ పట్నాయక్​ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒడిశాలో 60వేల మందికి పైగా ప్రైమరీ స్కూల్ టీచర్లకు ప్రమోషన్ లభించనుంది. దాంతో పాటే పలు సబ్జెక్టు ఉపాధ్యాయులు, హెడ్​మాస్టర్​ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రెసిడెన్సీ పిరియడ్​ అంటే.. పదోన్నతి పొందడానికి ఓ విభాగంలో పనిచేయాల్సిన కనీస సమయం. దానిని అసిస్టెంట్ టీచర్లకు ప్రస్తుతం ఉన్న సంవత్సర కాలం నుంచి 6 నెలలకు, లెవెల్ IV నుంచి లెవెల్​ III కి ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు.

ఇదీ చూడండి: ప్రపంచ బ్యాంకుకు సలహాదారుడిగా 'మహో'పాధ్యాయుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.