ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక- కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే మృత శిశువు జననం

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 9:54 PM IST

Minor Gave Birth To Died Baby In Rajasthan
Minor Gave Birth To Died Baby

Minor Gave Birth To Died Baby : రాజస్థాన్​లో దారుణం వెలుగు చూసింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ మైనర్​ 8 నెలల చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. కాగా, డీఎన్​ఏ పరీక్ష కోసం ఆ చిన్నారికి పోస్ట్​మార్టం నిర్వహించారు పోలీసులు.

Minor Gave Birth To Died Baby : తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మైనర్ 8 నెలల శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లోని చురు జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది
చురు జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆ మైనర్​ 8 నెలల గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. నొప్పి తీవ్రంగా ఉండడం వల్ల ఆమెకు ఆపరేషన్​ నిర్వహించి చనిపోయిన బిడ్డను బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు, కుటుంబీకులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, డీఎన్​ఏ పరీక్షల కోసం మరణించిన నవజాత శిశువుకు పోస్ట్​మార్టం నిర్వహించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక గర్భం దాల్చడానికి గల కారణమైన వ్యక్తిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.

"15 ఏళ్ల బాలిక 8 నెలల గర్భంతో ఆస్పత్రికి వచ్చినట్లు మాకు సమాచారం అందింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడం వల్ల బాధితురాలిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆమె తల్లి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె కడుపులో నుంచి 8 నెలలు నిండిన శిశువు మృతదేహం బయటపడింది. డీఎన్​ఏ పరీక్షల కోసం చిన్నారి మృతదేహానికి పోస్ట్​మార్టం చేయించాము. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం."
- అల్కా వైష్ణోయ్​, దుధ్వాఖారా పోలీస్​ స్టేషన్​ ఆఫీసర్​

మగ బిడ్డకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక
Girl Delivers A Baby Boy : ఇటీవల కర్ణాటకలో తుమకూరులో కూడా ఇలాంటి షాకింగ్ ఘటనే వెలుగు చూసింది. వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు హాస్టల్​ వార్డెన్​ను సస్పెండ్ చేశారు. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి- 10కి చేరిన మరణాలు

బతికుండగానే పెద్ద కర్మ- పత్రికలతో ఆహ్వానించి చావు భోజనం- కారణం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.