ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఐదుగురు పాక్ ముష్కరులు హతం

author img

By

Published : Jan 30, 2022, 6:44 AM IST

Updated : Jan 30, 2022, 7:32 AM IST

Kashmir Encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్

06:35 January 30

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఐదుగురు పాక్ ముష్కరులు హతం

Kashmir Encounter: Kashmir Encounter: జమ్ము కశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.

కశ్మీర్​లోని బుడ్గాం జిల్లాలోని చరర్​ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

"కశ్మీర్​లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎన్​కౌంటర్ దాదాపు 12 గంటలపాటు జరిగింది." అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.

"ఈ ఎన్​కౌంటర్​లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. ఉగ్రవాదులు జేఈఎం, ఎల్​ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారుగా గుర్తించాం. మృతుల్లో జేఈఎం కమాండర్ జాహిద్ వానీ ఉన్నాడు. ఇదో పెద్ద విజయం మాకు." అని కశ్మీర్ జోన్ పోలీస్ ట్వీట్ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'నేరగాళ్లను పోటీ చేయనీయొద్దు'

Last Updated :Jan 30, 2022, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.