ETV Bharat / bharat

'దిల్లీలో దాడులకు పాక్​ ఉగ్రసంస్థ కుట్ర'

author img

By

Published : Feb 15, 2021, 6:06 AM IST

J&K DGP
'దిల్లీలో పెద్ద ఎత్తున దాడులకు పాక్​ ఉగ్ర సంస్థ సన్నాహాలు'

పాకిస్థాన్​కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ దిల్లీలో​ భారీ ఎత్తున దాడులు జరిపేందుకు యత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ దేశ రాజధాని దిల్లీలో దాడులు జరిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్​ సింగ్ అన్నారు. ఇటీవలే ఓ జైషే ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో... డోభాల్ ఆఫీసు వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసిందని సింగ్​ పేర్కొన్నారు.

"కశ్మీర్​లోని కొందరు ఉగ్రవాదులు.. బిహార్ ​నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఆయుధాల రవాణా కోసం పంజాబ్​లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులను వినియోగించుకుంటున్నారు"

-దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ

లష్కరీ ముస్తఫా, ద రెసిస్టాన్స్ ఫ్రంట్​ ఉగ్రవాదులు.. హిదియాత్​ ఉల్లా మాలిక్, జహూర్ అమ్మద్ రాథర్ అరెస్టు నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు దిల్బాగ్ సింగ్.

ఇదీ చదవండి:వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.