ETV Bharat / bharat

'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్​ టీకా సాయం'

author img

By

Published : Sep 20, 2021, 6:25 PM IST

vaccine maitri
వ్యాక్సిన్ మైత్రి

భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్ టీకా డోసులను(vaccine maitri) అక్టోబర్​ నుంచి డిసెంబర్ మధ్య విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్రం తెలిపింది. అయితే.. దేశ పౌరులకు టీకా అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పింది. దేశంలో జరుగతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ దేశాలకు రోల్​ మోడల్​గా నిలుస్తుందని పేర్కొంది.

కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి(vaccine maitri) అండగా నిలిచింది భారత్​. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు(vaccine maitri) అందించి, సాయపడాలని భావిస్తోంది.

భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను 'వ్యాక్సిన్​ మైత్రి'(vaccine maitri) కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా తెలిపారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. దేశ పౌరులకు వ్యాక్సిన్(india vaccine news)​ వేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

"అక్టోబర్​లో 30 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులను కేంద్రం సేకరించనుంది. రాబోయే మూడు నెలల్లో ఈ సంఖ్య 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో 81 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. గత 11 రోజుల్లోనే 10 కోట్ల డోసులు అందజేశాం. అక్టోబర్​ నుంచి డిసెంబర్ మధ్య విదేశాలకు 'వ్యాక్సిన్​ మైత్రి' కార్యక్రమంలో భాగంగా.. విదేశాలకు టీకా ఎగుమతి చేస్తాం. దీనిద్వారా కొవాక్స్ కార్యక్రమానికి అండగా నిలుస్తాం. ఇదే మా వసుధైక కుటుంబం నినాదానికి నిదర్శనం."

- మన్​సుఖ్​ మాండవీయా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారత్​లో కొవిడ్​ వ్యాక్సిన్లపై(india vaccine news) పరిశోధన, ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోందని మాండవీయా తెలిపారు. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం(vaccination status in india).. ప్రపంచ దేశాలకు రోల్​ మోడల్​గా నిలుస్తుందని పేర్కొన్నారు.

'సమన్వయంతో పనిచేయాలి'

మరోవైపు.. దేశంలో ఎయిమ్స్​లన్నీ సమన్వయంతో పని చేయాలని మన్​సుఖ్​ మాండవీయా సూచించారు. అప్పుడే.. ప్రజలకు అత్యుత్తమ వైద్యసేవలు అందుతాయని చెప్పారు. సోమవారం దేశంలోని ఆరు ఎయిమ్స్​ల పని తీరుపై ఆయన దిల్లీలో సమీక్ష నిర్వహించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.