ETV Bharat / bharat

'మహిళల్ని కించపరచడమే వారి సిద్ధాంతం'

author img

By

Published : Apr 1, 2021, 1:44 PM IST

భాజపా నేత, సినీనటి ఖుష్బూ సుందర్​ తాను డీఎంకే నుంచి తప్పుకోవడంపై స్పందించారు. తనపై అభాండాలు మోపడం వల్లే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

సినీనటి ఖుష్బూ, khushbu sundar on dmk
సినీనటి ఖుష్బూ

డీఎంకే వేసిన అపనిందలే తనను 2014లో ఆ పార్టీ నుంచి తప్పుకునేలా చేశాయని భాజపా నేత ఖుష్బూ తెలిపారు. మహిళలను అగౌరవపరుస్తూ, తప్పుడు వ్యాఖ్యలు చేయడం డీఎంకే సిద్ధాంతం అని ఆరోపించారు. థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ వ్యాఖ్యలు చేశారు.

సినీనటి ఖుష్బూ, khushbu sundar on dmk
థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గం ప్రచారంలో ఖుష్బూ
సినీనటి ఖుష్బూ, khushbu sundar on dmk
థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గం ప్రచారంలో ఖుష్బూ
సినీనటి ఖుష్బూ, khushbu sundar on dmk
థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గం ప్రచారంలో ఖుష్బూ
సినీనటి ఖుష్బూ, khushbu sundar on dmk
థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గం ప్రచారంలో ఖుష్బూ

నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. డీఎంకే కంచుకోటగా చెప్పుకునే ఈ ప్రాంతంలో ఆ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు ఖుష్బూ. తనను గెలిపిస్తే ప్రతి ఆడపిల్ల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష వేస్తానని హామీ ఇచ్చారు. ఇంటికే రేషన్​ పంపిణీ సహా ప్రతివార్డులో అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేస్తామన్నారు. ​

ఇదీ చదవండి : భాజపా వ్యతిరేక పోరులో దీదీకి ముఫ్తీ మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.