ETV Bharat / bharat

నకిలీ విటమిన్​-డీ ట్యాబ్లెట్ల విక్రయం..​ ప్రముఖ ఫార్మా సంస్థ సీజ్​​!

author img

By

Published : Feb 4, 2022, 11:10 AM IST

Updated : Feb 4, 2022, 12:53 PM IST

fake tablets company seal: నకిలీ విటమిన్​ డీ మాత్రలు తయారు చేస్తున్న ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రముఖ ఫార్మా సంస్థను సీజ్​​ చేశారు దిల్లీ డ్రగ్స్​ కంట్రోల్​ విభాగం అధికారులు. ఈ మందులు ఎక్కడ తయారు చేస్తున్నారని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

FAKE TABLETS
నకిలీ విటమిన్​ మందులు

Fake tablets company seal: కరోనా విజృంభిస్తున్న తరుణంలో విటమిన్​ డీ మాత్రలకు గిరాకీ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు నకిలీ మందులను తయారు చేస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీలో నకిలీ విటమిన్​ డీ మాత్రలు భారీగా లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఆ ఫార్మా సంస్థను సీజ్​ చేసింది దిల్లీ డ్రగ్స్​ కంట్రోల్​ విభాగం.

మక్లైడ్స్​ ఫార్మాసుటికల్స్​ సంస్థ పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నారని.. ఆ సంస్థ నుంచి ఫిర్యాదు అందిన క్రమంలో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు చివరి వారంలో దిల్లీలో విక్రయిస్తుండగా కొందరు పట్టుబడ్డారని చెప్పారు. అవి ఆగ్రా నుంచి వస్తున్నట్లు గుర్తించి.. స్థానిక అధికారులతో కలిసి మాధవ్​ ఫార్మాలో జనవరి 19న తనిఖీ చేసి నమూనాలను సేకరించామన్నారు. నమూనాలను పరీక్షించగా నకిలీ మందులుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. మాధవ్​ ఫార్మాను సీజ్​​ చేసినట్లు తెలిపారు.

అయితే.. ఈ మాత్రలు ఎక్కడ తయారు చేస్తున్నారని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Last Updated :Feb 4, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.