ETV Bharat / bharat

జడ్జి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Aug 2, 2021, 7:59 AM IST

ఝార్ఖండ్​ ధన్​బాద్​ జిల్లా అదనపు న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ హత్య అనంతరం పలు కేసులతో సంబంధమున్న 17 మందిని అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు. 243 మంది నేరగాళ్లను విచారించినట్లు పేర్కొన్నారు. అలాగే న్యాయమూర్తి హత్యకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన సబ్​-ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్​ చేసినట్లు వెల్లడించారు.

Dhanbad judge case
జడ్జి హత్య కేసులో దర్యాప్తు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఝార్ఖండ్​, ధన్​బాద్​ జిల్లా అదనపు న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది జిల్లా పోలీసు యంత్రాంగం. ఈ నేపథ్యంలో పలు కేసులతో సంబంధాలున్న 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 243 మంది నేరగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఓ అధికారి తెలిపారు.

జడ్జిని ఆటో ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీని బయటకు వదిలినందుకు సబ్​-ఇన్​స్పెక్టర్​ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది

గత నెల 28 తెల్లవారుజామున వాకింగ్​కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్​తో పాటు అతడి అనుచరుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్​ అయిన దృశ్యాలను చూస్తే ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు యత్నించినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

న్యాయ వర్గాల్లో కలకలం రేపిన ఈ ఘటనపై.. ఝార్ఖండ్‌ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

ఇదీ చూడండి: జడ్జి హత్యపై దుమారం- అసలు కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.