ETV Bharat / bharat

పొలంలో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి

author img

By

Published : Mar 23, 2021, 1:54 PM IST

ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లిద్దరు పొలంలో చెట్టుకు ఉరేసుకొని విగతజీవులుగా మారిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బిసాల్​పుర్​ ప్రాంతంలో జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bodies of 2 sisters found hanging in UP's Pilibhit
పొలంలో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు

ఉత్తర్​ప్రదేశ్​లో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పొలంలోని ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.

పిలిభిత్ జిల్లా బిసాల్​పుర్​లోని ఓ పొలంలో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతులిద్దరూ సోమవారం నుంచి కనిపించకుండా పోయారని వెల్లడించారు.

Bodies of 2 sisters found hanging in UP's Pilibhit
పొలంలో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జయప్రకాశ్ స్పష్టం చేశారు.

యువతుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ప్రమాదంలో యువకుడు మృతి- పోలీసులపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.