ETV Bharat / bharat

ఎన్నికల వేళ.. భాజపా బహిష్కృత నేత ఇంటి వద్ద పేలుడు

author img

By

Published : Mar 5, 2022, 2:30 PM IST

manipur bomb blast
మణిపుర్​లో బాంబుపేలుడు

Manipur Bomb Blast: మణిపుర్​లో బాంబు పేలుడు కలకలం రేపింది. భాజపా బహిష్కృత నేత చోంగ్తామ్ బిజోయ్ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

manipur bomb blast: మణిపుర్​లో భాజపా బహిష్కృత నేత చోంగ్తామ్ బిజోయ్ నివాసం దగ్గర్లో బాంబు పేలుడు జరిగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంపెల్​లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

బిజోయ్​ను గతనెలలోనే భాజపా పార్టీ.. క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. రాజకీయంగా అణగదొక్కేందుకే తనపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని జిజోయ్ అన్నారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలోని 22 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ బాంబు పేలుడుతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.