ETV Bharat / bharat

నమస్తే ట్రంప్: భారత్​కు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు

author img

By

Published : Feb 23, 2020, 9:15 PM IST

Updated : Mar 2, 2020, 8:15 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బయల్దేరారు. జాయింట్ బేస్ ఆండ్రూస్ స్థావరం నుంచి ప్రయాణం ప్రారంభించారు. పర్యటనకు ముందు శ్వేతసౌధంలో మాట్లాడిన ట్రంప్... భారత్​ను సందర్శించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

US President Trump leaves for maiden visit to India
అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పాటు భారత పర్యటన కోసం బయల్దేరారు. వాషింగ్​టన్​లోని జాయింట్ బేస్ ఆండ్రూస్​ సైనిక స్థావరం నుంచి ఎయిర్​ఫోర్స్​ వన్​లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్... చాలా రోజుల క్రితమే భారత్​కు రావడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని మరోసారి ఉద్ఘాటించారు. భారత పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

"భారత ప్రజలను కలిసేందుకు ఎదిరిచూస్తున్నా. అక్కడ లక్షల మంది మాకోసం ఉన్నారు. ఇది సుదీర్ఘ పర్యటన. నేను ప్రధాని మోదీతో బాగా కలిసిపోతాను. అతను(మోదీ) నా స్నేహితుడు. చాలా రోజుల క్రితమే భారత పర్యటనకు రావాలనుకున్నాను. ఇది చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. భారత్​లో ఇప్పటివరకు ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగలేదని ప్రధాని నాతో చెప్పారు."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​, అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్​ సైతం భారత పర్యటన కోసం బయలుదేరారు. రేపు ఉదయం 11:30 గంటలకు అహ్మదాబాద్ చేరుకోనున్నారు.

Last Updated :Mar 2, 2020, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.