ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు బలి

author img

By

Published : May 20, 2020, 5:50 PM IST

Updated : May 20, 2020, 7:14 PM IST

terrorists-attack
కశ్మీర్​లో ఉగ్రదాడి

18:02 May 20

కశ్మీర్​లో ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్​​లో ఉగ్రదాడి జరిగింది. గండేర్​బల్ జిల్లా పాండచ్ ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్​ఎఫ్​ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. 

" శ్రీనగర్​కు 17 కిలోమీటర్ల దూరంలోని పాండచ్​ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జవాన్లపై ద్విచక్రవాహనంపై వచ్చిన ముష్కరులు దాడి చేశారు. ఇద్దరు బీఎస్​ఎఫ్​ జవాన్ల తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని సౌర ప్రాంతంలోని స్కిమ్స్​ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఒకరు మృతిచెందారు." 

                                                                 - అధికారులు

ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాల్ని మోహరించి, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. 

17:45 May 20

బీఎస్​ఎఫ్​ జవాన్లపై తీవ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​ గండేర్​బల్​ జిల్లా పాండచ్​ ప్రాంతంలో బీఎస్​ఎఫ్​ జవాన్లపై తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. 

Last Updated :May 20, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.