ETV Bharat / bharat

'భారత్..​ సమస్యలను అవకాశాలుగా మలచుకుంటుంది'

author img

By

Published : Jun 28, 2020, 11:21 AM IST

దేశంపై కరోనా మహమ్మారి విజృంభన, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్​ ఎప్పుడూ సమస్యలను అవకాశాలుగా మలుచుకుంటోందన్నారు. మనసులో మాట(మన్​ కీ బాత్​) కార్యక్రమంలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.

Prime Minister Modi to share thoughts in 'Mann ki Baat'
మనుసులో మాటలో ప్రధాని ప్రసంగం

సమస్యలు ఎదురైనప్పుడు భారత్​ వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ప్రారంభం నుంచి కరోనా సహా పలు ప్రకృతి విప్తతులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. మనసులో మాట (మన్​ కీ బాత్​) కార్యక్రమంలో భాగంగా కీలక విషయాలు వెల్లడించారు.

" ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో 2020 ఏడాది ఎప్పుడు ముగుస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ సంవత్సరం సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అదిగమించగలమని చరిత్ర చెబుతోంది. సమస్యలు వచ్చినప్పుడే మనం మరింత బలవంతులం అవుతాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సరిహద్దుల్లో భారత్​ సామర్థ్యం ప్రపంచమంతా చూసిందని పేర్కొన్నారు మోదీ. లద్దాఖ్​లో సైనికులు తమ శౌర్యం ఎలాంటిదో చూపించారని, రక్షణ రంగంలో దశం ప్రస్తుతం అనేక దేశాల కంటే ముందుందన్నారు. దేశంలో అనేక యుద్ధ పరికరాల పరిశ్రమలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.