ETV Bharat / bharat

'నేటి మన్ ​కీ బాత్​లో  కరోనానే ప్రధాన అంశం'

author img

By

Published : Mar 29, 2020, 5:49 AM IST

Updated : Mar 29, 2020, 5:56 AM IST

నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కరోనాపైనే దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

Latest Mann ki Baat
నేటి 'మాన్ ​కీ బాత్​'లో కరోనాపైనే దృష్టి: మోదీ

ఈరోజ నిర్వహించే మనసులో మాట (మన్​ కీ బాత్​) కార్యక్రమంలో ప్రధానంగా కరోనా వైరస్​ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపైనే తమ దృష్టి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు, క్వారంటైన్​ సౌకర్యాలు, వ్యాధి తీవ్రత వంటి కీలక అంశాలపై మాట్లాడనున్నట్లు ట్వీట్​ చేశారు.

Latest Mann ki Baat
ప్రధాని మోదీ ట్వీట్​

" ఉదయం 11 గంటలకు మన్​ కీ బాత్​ కార్యక్రమం ఉంది. నేటి ఎపిసోడ్​లో ప్రధానంగా కరోనా కారణంగా ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులపైనే దృష్టి ఉంటుంది. "

- ప్రధాని మోదీ ట్వీట్.

ప్రతి నెల చివరి ఆదివారం రోజున మనసులో మాట కార్యక్రమం నిర్వహిస్తారు మోదీ. దేశంలోని తాజా అంశాలపై మాట్లాడుతారు.

ఇదీ చూడండి: కరోనా ఎలా ఉంటుందో తెలుసా?.. ఈ చిత్రాల్లో చూడండి

Last Updated :Mar 29, 2020, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.