ETV Bharat / bharat

ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక

author img

By

Published : Jun 16, 2020, 10:46 AM IST

Updated : Jun 16, 2020, 11:27 AM IST

దేశ రాజధానిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, మంత్రులు, వైద్యులు ఇలా వరుసగా వైరస్​ బారినపడుతున్నారు. తాజాగా దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో​ ఆసుపత్రిలో చేరారు.

Delhi's Health Minister Satyendar Jain has been admitted to Hospital
దిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్​.. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రాజీవ్​ గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. కరోనా లక్షణాల నేపథ్యంలో.. ఆయన నుంచి నమూనాలను సేకరించారు వైద్యులు. సాయంత్రం కల్లా ఫలితాలు వచ్చే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

దేశ రాజధానిలో కొవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా తీరిక లేకుండా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు జైన్​. మరోవైపు ఆదివారం.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలకూ హాజరయ్యారు.

Delhi's Health Minister Satyendar Jain has been admitted to Hospital
సత్యేంద్ర జైన్​ ట్వీట్​

జైన్​ చేసిన ట్వీట్​పై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'నీ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా.. 24 గంటలూ ప్రజల క్షేమం కోసం శ్రమించారు' అని కొనియాడారు సీఎం.

Last Updated :Jun 16, 2020, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.