ETV Bharat / bharat

కరోనా టీకా పంపిణీలో భారత్​ మరో ఘనత

author img

By

Published : Feb 7, 2021, 4:09 PM IST

కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియలో భారత్​ మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక మందికి వ్యాక్సినేషన్​ చేసిన మూడో దేశంగా నిలిచింది. ఇప్పటి వరకు 57.75 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించింది.

vaccination in india
కరోనా టీకా పంపిణీలో భారత్​ మరో ఘనత

కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్​ సరికొత్త మైలు రాళ్లను చేరుకునే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎక్కవ మందికి టీకా అందించిన మూడో దేశంగా నిలిచింది. అమెరికా, బ్రిటన్​ మాత్రమే భారత్​ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది.

ఇంకా ఏం చెప్పిందంటే..

  • ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 2 లక్షలకు పైగా మందికి టీకా అందింది.
  • ఉత్తర్​ ప్రదేశ్​లో అత్యధికంగా.. 6,73,542 మంది టీకా తీసుకున్నారు.
  • ఫిబ్రవరి 7, ఉదయం 8 గంటల వరకు.. దేశంలో మొత్తం 57.75 లక్షల మందికి వ్యాక్సిన్​ అందింది. వారిలో 53,04,546 మంది ఆరోగ్య సిబ్బంది కాగా.. 4,70,776 మంది కరోనా యోధులు ఉన్నారు.
  • శనివారం నిర్వహించిన 8,875 సెషన్లలో 3,58,473 లబ్ధిదారులకు టీకా అందింది. ఇప్పటివరకు మొత్తం 1,15,178 వ్యాక్సినేషన్​ సెషన్లను నిర్వహించారు.

కరోనా టీకా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. దేశంలో తాజాగా 80 కంటే తక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 9 నెలల్లోనే ఇదే అత్యల్పం అని చెప్పింది.

కొత్త కేసుల వివరాలు ఇలా..

  • దేశంలో ప్రస్తుతం 1.48 లక్షల యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా బాధితుల్లో ఇది 1.05 శాతం మాత్రమే.
  • కొత్తగా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 81.07 శాతం రికవరీలు నమోదయ్యాయి.
  • కేరళలో కొత్తగా 6.178 మంది, మహారాష్ట్రలో 1,739 మంది, తమిళనాడులో 503 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • కొత్త కేసుల్లో 84.83 శాతం కేసులు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.
  • కేరళలో అత్యధికంగా 5,942 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,768 కేసులు, కర్ణాటకలో 531 కేసులు వెలుగుచూశాయి.
  • శనివారం 78 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • మొత్తం మరణాల్లో 69.23 శాతం ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.
  • మహారాష్ట్రలో అత్యధికంగా 25 మంది మృతి చెందగా.. కేరళలో 16 మంది.. వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్​లో ఐదుగురు మృతి చెందారు.

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు ఏవీ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి:మరో 7 కొవిడ్​ టీకాలు సిద్ధమవుతున్నాయి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.