20 అడుగుల లోతులో పడ్డ ఏనుగులను రక్షించిన అటవీ సిబ్బంది

By

Published : Oct 28, 2022, 9:36 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

ఛత్తీస్‌గఢ్ ధామ్‌తరి జిల్లాలో మూడు ఏనుగులు 20 అడుగుల లోతున్న గుంతలో పడిపోయాయి. వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న గుంత పక్కనుంచి వెళ్తున్న 32 ఏనుగుల్లో మూడు ఏనుగులు అదుపు తప్పి గుంతలో పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గురువారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంత నుంచి రెండు ఏనుగులను రక్షించారు. మరో ఏనుగును కాపాడటానికి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ ఏనుగుల గుంపు ఆ గొయ్యి చుట్టూ తిరుగుతుండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని డీఎఫ్‌వో మయాంక్ పాండే తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.