ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Dec 21, 2022, 12:58 PM IST

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • మాచర్ల హింసాత్మక ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ...
    మాచర్ల హింసపై టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. మాచర్ల హింసాత్మక ఘటనలో బాధితులైన టీడీపీ నేతలపైనే పోలీసులు ఏకపక్షంగా హత్యాయత్నం కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పల్నాడులో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు
    నడిరోడ్డుపై ముస్లిం వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. వరవకట్టకు చెందిన షేక్‌ ఇబ్రహీం, రహమత్‌ అలీ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి ఇబ్రహీంను హత్య చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రతిపాదనేమీ లేదు: నిరంజన్‌ జ్యోతి
    రాష్ట్రంలో అమలుచేస్తున్న గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. పార్లమెంట్​లో చర్చ జరిగింది.. దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఏమైనా ఉందానని వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాదానం ఇచ్చారు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం సభకు వచ్చి ఇబ్బందుల్లో విద్యార్థులు.. ముందే ట్యాబ్​ల అందజేత
    బాపట్ల జిల్లాలో సీఎం సభకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. సభాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సులు నిలిపివేయడంతో నడవాల్సి వచ్చింది. సభలో ఖాళీ లేదంటూ కొందరు విద్యార్థులకు సీఎం పంపిణీ చేయక ముందే ట్యాబ్‌లు ఇచ్చి పంపేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • 'భారత్​-చైనా సరిహద్దు సమస్యపై మౌనమెందుకు'.. పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన
    భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ మండిపడ్డారు. అలాంటి తీవ్రమైన సమస్యపై పార్లమెంట్​లో చర్చకు అనుమతి నిరాకరించడం.. మన ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అని ఆమె విమర్శించారు. మరోవైపు, బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బహిర్భూమికి వెళ్లిన మహిళపై గ్యాంగ్​రేప్​.. నోట్లో వస్త్రాన్ని కుక్కి.. బలవంతంగా..
    పొలానికి మలవిసర్జన కోసం వెళ్లిన మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజస్థాన్​లో జరిగిందీ ఘటన. మరోవైపు, కర్ణాటకలోని దివ్యాంగురాలైన కన్నకూతురిని గొంతు కోసి హత్య చేసింది ఓ తల్లి. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశం నిషేధం.. తాలిబన్ ప్రభుత్వం ఆదేశం..
    తాలిబన్​ ప్రభుత్వం మరోసారి మహిళా విద్యార్థుల పట్ల ఆంక్షలు విధించింది. మహిళా విద్యార్ధులకు ఉన్నత విద్యను నిలిపేయాలని యూనివర్సిటీలకు రాసిన లేఖలో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెస్సి జట్టుకు తప్పిన ప్రమాదం.. ప్లేయర్స్​ను హెలికాప్టర్‌లో తరలింపు
    సాకర్‌ సమయంలో విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో అఖండ స్వాగతం లభించింది. మెస్సి జట్టును చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అయితే ఈ అభిమానం కాస్త శ్రుతి మించింది. అలానే మరోవైపు ఆటగాళ్లు కూడా ఓ పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్నారు. ఆ వివరాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్​.. స్టార్స్​ అంతా ఒకే ఫ్రేమ్​లో.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ!
    మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని రామ్‌చరణ్‌ ఇంట వేడుకలు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.