Government Teacher From Rayachoti Died in Hyderabad: అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన ప్రభుత్వ టీచర్ హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మియాపూర్లోని ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టీచర్ జయప్రకాష్ విషం మాత్రలు మింగినట్లుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు ఉన్నాయి. జయప్రకాష్ రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆర్ధిక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేక వేరే ఇతర కారణాలతో ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీకి చెందిన ప్రభుత్వ టీచర్ హైదరాబాద్లో మృతి - హత్యా ? ఆత్మహత్యా ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 3:47 PM IST
Government Teacher From Rayachoti Died in Hyderabad: అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన ప్రభుత్వ టీచర్ హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మియాపూర్లోని ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టీచర్ జయప్రకాష్ విషం మాత్రలు మింగినట్లుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు ఉన్నాయి. జయప్రకాష్ రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆర్ధిక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేక వేరే ఇతర కారణాలతో ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.