ఎస్పీ ముందు లొంగిపోయిన 13 మంది మావోయిస్టు సానుభూతిపరులు - Maoist sympathizers

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 3:53 PM IST

thumbnail
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా (ETV Bharat)

Maoist sympathizers: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పెద్దబయలు మండలం కిన్నెల కోట పంచాయతీకి చెందిన 13 మంది మావోయిస్టు, మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. సుమారు 10 ఏళ్లుగా మావోయిస్టులకు వీళ్లందరూ సహాయ సహకారాలు అందించారన్నారు. వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం వంటి పలు అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారని ఎస్పీ గుర్తు చేశారు.  ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధివైపు అడుగులు వేయడంతో ఓ పక్కన ఒక రహదారులు మరో పక్కన సెల్ టవర్ల నిర్మాణంతో వీరంతా లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.  ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సహకాలు అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారు ఏఓబీ కిన్నెల కోట పంచాయతీకి చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

మిలీషియా సభ్యులు మాట్లాడుతూ తామంతా ఇప్పటికే మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకే పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు పేర్కొన్నారు. అంతా నిర్ణయించుకునే  పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.