ETV Bharat / state

CM Jagan meeting with Party Leaders : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 4:58 PM IST

CM Jagan meeting with Party Leaders: రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కింది స్థాయిలో నేతలంతా కృషి చేయాలని వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కింది స్థాయి నేతల భుజస్కందాలపైనే ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన మంచిని ఇంటింటికీ తిరిగి వివరిస్తూ తిరిగి ఆశీర్వదించాలని కోరాలన్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 4 ప్రధాన కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపిన సీఎం.. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఎపీ నీడ్ వైఎస్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్ర పేరిట కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

YCP Wide Scale Meeting Chaired By CM Jagan
YCP Wide Scale Meeting Chaired By CM Jagan

CM Jagan meeting with Party Leaders: రాబోయే సాధారణ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా.. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాలకు గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు మినహా మిగిలిన అన్ని స్థాయిల్లో నేతలు తరలివచ్చారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్... వైసీపీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను, పార్టీ నేతలు అనుసరించాల్సిన కార్యాచరణను ప్రకటించి దిశానిర్దేశం చేశారు.

YCP Wide Scale Meeting Chaired By CM Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్

రాబోయే రోజుల్లో ప్రధానంగా నాలుగు కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న జగనన్న ఆరోగ్య సురక్ష వాటిలో మొదటి కార్యక్రమమని సీఎం తెలిపారు. పేదలకు మంచి వైద్యాన్ని చేయి పట్టుకుని అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఓ సారి ఈ తరహా క్యాంపులు కొనసాగుతాయని జగన్ తెలిపారు. వ్యాధి నయమయ్యే వరకు ఉచితంగా వైద్యం, మందులు ఇస్తామన్నారు. ప్రజలకు మరింత సేవ, మంచి చేసేందుకే "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి డిసంబర్ 10 వరకు 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలంతా మండలంలోని ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని జగన్ ఆదేశించారు. 1 కోటి 60 లక్షల ఇళ్లలోని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలియజేయాలన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు బోర్డులు ఆవిష్కరించి, ప్రతి గ్రామంలో వైసీపీ జెండా ఎగుర వేయాలన్నారు.

Anam Venkata Ramana Reddy on Jagan: 'జగన్ అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది.. 'సాక్షి'లోకి షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల పెట్టుబడులు'

అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర మూడో కార్యక్రమంగా చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ని 175 నియోజకవర్గాల్లోనూ తిరిగేలా బస్సు యాత్రలు నిర్వహించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయాలని, యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నేతలు పాల్గొనాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం మూడు ప్రాంతాల నుంచి 3 బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర పేరిట నాలుగో కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే ఈ క్రీడా సంబరాల్లో పార్టీ నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఇకపై ప్రతి ఏటా నిర్వహిస్తామన్నారు. ఈనెల 25 నుంచి జనవరి 15 వరకు ఈ నాలుగు రకాల కార్యక్రమాలు చేపడతామని, వీటిలో ప్రతి ఒక్క పార్టీ నేత భాగస్వామ్యమై, ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ విజయవంతం చేయాలని సీఎం నిర్దేశించారు.

Why AP does not Needs Jagan: ఇన్ని ఘోరాలు చేసి.. మళ్లీ ఓటు ఎలా అడుగుతావు జగనన్నా..?

వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ద్వారా నాలుగు పథకాల ద్వారా లబ్ది చేకూర్చే కార్యక్రమం చేపడతామని సీఎం తెలిపారు. జనవరి 1 న వృద్దాప్య, వితంతు పెన్షన్లను 3 వేలకు పెంచుతామన్నారు. జనవరి 1 నుంచి 10 వరకు గ్రామ స్థాయిలో సంబరాల్లో అందరూ మమేకం కావాలన్నారు. జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్ ఆర్ చేయూత ద్వారా మహిళలకు లబ్ది చేకూర్చుతామని, దీనికోసం 5 వేల కోట్లు ఇస్తామన్నారు. జనవరి 20 నుంచి 30 వరకు స్వయం సహాయక మహిళా బృందాలకు రుణాలు మాఫీ చేసే వైఎస్ ఆర్ ఆసరా కార్యక్రమం చివరి విడత కింద రూ. 6500కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఫిబ్రవరి లోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తామని, ప్రతి ఇంటికీ మేనిఫెస్టో అందించి జగన్ ను మళ్లీ తెచ్చుకుందామని కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్దేశించారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం వాగ్దానాలు అమలు చేశామని పేర్కొన్నారు.

'చంద్రబాబును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. చంద్రబాబు పై నాకు ఎలాంటి కక్ష లేదు. నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది. జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మేం ఎవరితోనూ పొత్తుపెట్టుకునేది లేదు. దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నాను. రెండు సున్నాలు కలిసినా... నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్టు సున్నా మాత్రమే. ఓ పార్టీ పెట్టి 15 ఏళ్లు అయినా కింది స్థాయిలో జెండా పట్టేవారు లేరు.' - వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

YCP Delegates Meeting in Vijayawada: ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం.. సీఎం ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.