ETV Bharat / sports

రవిశాస్త్రికి పంత్​ ఊహించని 'గిఫ్ట్'​.. ఈలలతో మోగిపోయిన స్టేడియం!

author img

By

Published : Jul 18, 2022, 3:26 PM IST

టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్​ రవిశాస్త్రిపై బ్యాటర్​ పంత్​ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రికి ఓ ఊహించని బహుమతిని ఇచ్చాడు.

Ravisastri Accepted champagne bottle from pant
రవిశాస్త్రికి పంత్​ ఊహించని గిఫ్ట్​.. ఏం ఇచ్చాడంటే?

Pant offers champagne bottle Ravisastri: ఇంగ్లాండ్​తో జరిగిన మూడే వన్డేలో విజయం సాధించిన టీమ్​ఇండియా.. వన్డే సిరీస్​ను 2-1తేడాతో సొంతం చేసుకుంది. హార్దిక్​ పాండ్య ఆల్​రౌండ్​ ప్రదర్శన, పంత్​ ధనాధన్​ ఇన్నింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరు కలిసి ఐదో వికెట్​కు 115 బంతుల్లో 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం పాండ్య ఔట్​ అయినప్పటికీ.. పంత్​ మాత్రం ఆఖరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్​ను ముగించాడు. దీంతో అతడి అద్భుత ప్రదర్శనకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు వరించింది. దీంతో పాటే అవార్డు ప్రజెంటేషన్​ సమయంలో నగదుతో పాటు షాంపైన్​ బాటిల్​ను కూడా అందజేశారు. అయితే ఆ షాంపైన్​ బాటిల్​ను అందుకున్న పంత్​.. ఎవరూ ఊహించని పని చేశాడు.

ఈ మ్యాచ్​కు కామెంటేటర్​గా వ్యవహరిస్తున్న భారత్​ మాజీ హెట్​ కోచ్​ రవిశాస్త్రిపై తన అభిమానాన్ని చాటుతూ.. షాంపైన్​ బాటిల్​ను గిఫ్ట్​గా ఇచ్చాడు. ఆ సమయంలో స్డేడియం ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో హల్​చల్​ చేస్తుంది. కాగా, రవిశాస్త్రి హెడ్​ కోచ్​గా ఉన్న సమయంలోనే పంత్​ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలానే తన తొలి దశలో అతడు విఫలమైనప్పటికీ.. చాలా సందర్భాల్లో రవిశాస్త్రి పంత్​కు అండగా నిలిచాడు. కాగా, ఈమ్యాచ్​లో టీమ్​ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్​ఇండియా.. 42.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పంత్​, హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్​.. టీమ్​ఇండియాదే సిరీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.