ETV Bharat / sports

కోహ్లీ, దాదా గొడవ.. అలా చేయాలని కపిల్​దేవ్​ సూచన

author img

By

Published : Jan 26, 2022, 11:10 AM IST

kohli ganguly issue: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మధ్య విభేదాలును వాళ్లిద్దరూ కలిసి ముగింపు పలకాలని అభిప్రాయపడ్డాడు మాజీ కెప్టెన్ కపిల్​ దేవ్​. టెస్టు క్రికెట్​లో విరాట్​ ఎక్కువ పరుగులు చేస్తే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

kohli ganguly issue
kohli ganguly issue

kohli ganguly issue: గత కొద్ది రోజులుగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ- బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మధ్య వివాదం తారస్థాయికి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పలువురు మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మాజీ కెప్టెన్​ కపిల్​దేవ్​ ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడాడు.

"కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వాళ్లిద్దరూ ఫోన్​ చేసుకుని మాట్లాడుకుంటే మంచిది. భారత క్రికెట్​ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నా. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి. మొదట్లో నాకు కావాల్సిన ప్రతీది నాకు లభించింది. కొన్ని సందర్భాల్లో అది జరగదు. దాని అర్థం కెప్టెన్సీ వదిలేయాలని కాదు. ఒకవేళ అదే కారణం వల్ల అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లయితే దానికి నేనేం చెప్పలేను. విరాట్​ గొప్ప ఆటగాడు. అతడు టెస్టు క్రికెట్​లో మరిన్ని పరుగులు చేస్తుంటే చూడాలని ఉంది"

-కపిల్​ దేవ్​, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​.

గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకొన్నాడు. ఆ సమయంలో విరాట్​తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ తెలిపాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు. ఆ తర్వాత తనపై విరాట్ చేసిన వ్యాఖ్యలతో గంగూలీ కోపానికి గురయ్యాడని, అతడికి షో కాజ్​ నోటీసులు ఇవ్వబోయాడంటూ వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

కోహ్లీకి దాదా షోకాజ్​ నోటీసులు పంపించాలనుకున్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.