ETV Bharat / sitara

ఆ హీరోలే ట్రోల్స్ చేయిస్తున్నారు: కలెక్షన్ కింగ్ మోహన్​బాబు

author img

By

Published : Feb 17, 2022, 4:32 PM IST

Updated : Feb 17, 2022, 6:14 PM IST

Mohan babu son of india: తనపై ట్రోల్స్ చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని సీనియర్ నటుడు మోహన్​బాబు అన్నారు. ఇద్దరు హీరోలే ఈ పనంతా చేయిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

mohan babu
మోహన్​బాబు

Mohan babu trolling: సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై నటుడు మోహన్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ ఇద్దరు హీరోలే ఈ ట్రోలింగ్స్‌ చేయిస్తున్నారని ఆయన అన్నారు. 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. దర్శకుడు రత్నబాబు కథ చెప్పిన వెంటనే తనకు బాగా నచ్చేసిందని తెలిపారు. 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ఓ మంచి కథ అని, సినిమా చూసిన ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని పేర్కొన్నారు.

"ఓసారి రత్నబాబు నన్ను కలిసి 'సన్‌ ఆఫ్‌ ఇండియా' కథ చెప్పారు. కుల వ్యవస్థ, రాజకీయం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో కీలక అంశాలను ఈ సినిమాలో చూపించాం. ఒక రాజకీయ నాయకుడి కారణంగా ఓ అమాయకుడైన వ్యక్తి ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్యాయంగా ఎలా జైలుకు వెళ్లాడు?.. ఇలాంటి ఎన్నో అంశాలపై ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. భారతదేశంలో ఎంతోమంది చేయని తప్పుకు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. ప్రైవేటు జైలు అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో చూపించాం" అని మోహన్​బాబు చెప్పారు.

అనంతరం సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై స్పందిస్తూ.. "సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ను తెలిసిన వాళ్లు అప్పుడప్పుడూ నాకు పంపిస్తుంటారు. ఒక్కొసారి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుంటుంది. ట్రోల్స్‌ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదు. ఓ ఇద్దరు హీరోలు.. కొంతమందిని అపాయింట్‌ చేసుకుని ఇలాంటి ట్రోల్స్‌ క్రియేట్‌ చేయిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో నాకు బాగా తెలుసు. ట్రోల్స్‌ చేయించేవాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ, ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు" అని మోహన్‌బాబు కామెంట్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated :Feb 17, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.