ETV Bharat / city

Topnews:ప్రధాన వార్తలు @7PM

author img

By

Published : Dec 20, 2021, 6:56 PM IST

.

ప్రధాన వార్తలు @7PM
ప్రధాన వార్తలు @7PM

  • OTS Scheme: రేపట్నుంచి ఓటీఎస్‌ ప్రారంభం : మంత్రి కొడాలి
    Kodali Nani On OTS Scheme: రాష్ట్రంలో రేపటి నుంచి వన్​ టైం సెటిల్​మెంట్ (ఓటీఎస్) పథకం అమలు చేయనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎంత రుణం ఉన్నా.. ఓటీఎస్ ద్వారా రూపాయి తీసుకుకోకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది పేదలకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Video Viral: 'పెద్దాయననే విమర్శిస్తావా?'.. సొంత పార్టీ కార్యకర్తపై వైకాపా శ్రేణుల దాడి!
    సొంత పార్టీ నేతను విమర్శించాడని ఓ కార్యకర్తపై వైకాపా శ్రేణులు విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Balineni On Attack: 'కార్యకర్తపై అందుకే దాడి చేసి ఉంటారు': మంత్రి బాలినేని
    Minister Balineni On Attack issue: ఒంగోలులో వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ నేతలు విచాక్షణారహితంగా దాడి చేయటంపై మంత్రి బాలినేని స్పందించారు. గుప్తా మానసిక స్థితి సరిగా లేదన్న బాలినేని.. ఆయనపై దాడి జరుగుతోందని తెలిసి ఆగమని తమ వాళ్లకు చెప్పానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • additional loan for housing: పేదల ఇళ్లకు రూ.35 వేల అదనపు రుణం.. ప్రభుత్వం ఉత్తర్వులు!
    additional loan for housing: "పేదలందరికీ ఇళ్లు పథకం" లబ్ధిదారులు.. బ్యాంకుల నుంచి రూ.35 వేలు అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణానికిగానూ.. ఈ వెసులుబాటు కల్పిస్తూ.. గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'చాలామంది వృద్ధులు జైల్లో ఉన్నారు.. ఆయన బయటెందుకు?'
    Varavara Rao NIA: అనారోగ్యకారణాల దృష్ట్యా విరసం నేత వరవరరావు(83)కు బాంబేహైకోర్టు పలుమార్లు బెయిల్​ పొడిగించడాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) వ్యతిరేకించింది. వైద్య చికిత్స అవసరం ఉన్న చాలామంది వృద్ధులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని స్పష్టం చేసింది. వరవరరావును జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది ఎన్​ఐఏ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రభుత్వానికి రాహుల్​ సవాల్​.. వాటిపై చర్చకు డిమాండ్​!
    Rahul Gandhi attacks government: విపక్షాలు లేవనెత్తిన ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ చేపట్టాలని కేంద్రానికి సవాల్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. సమస్యలను లేవనెత్తకుండా తమ గొంతుకను అణచివేయలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. విభజించు-పాలించు సూత్రంతో కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత మల్లిఖార్జున్​ ఖర్గే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మైనస్​లోకి ఉష్ణోగ్రతలు- నీళ్లు కావాలంటే నల్లాలను వేడి చేయాల్సిందే!
    Winter season in Leh ladakh: లద్దాఖ్​లోని లేహ్​ ప్రజలపై 'శీతాకాలం' ప్రభావం పడింది. అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్​లోకి జారుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల చిన్ననీటి జలవనరులు పూర్తిగా మంచుగడ్డలుగా మారిపోయాయి. మంచినీరు కావాలంటే నల్లాలను వేడిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'
    Omicron severity: కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్​ ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నప్పటికీ.. అధిక తీవ్రతను కలిగించదని అందరూ భావిస్తున్నారు. అయితే.. అలా నమ్మేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. టీకాల ద్వారా, గతంలో వైరస్​ బారినపడిన ద్వారా కలిగే రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఈ వేరియంట్​కు ఉన్నట్లు చెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ అల్లుడు
    Shoaib Malik's Nephew: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అల్లుడు మహమ్మద్ హురైరా చరిత్ర సృష్టించాడు. దేశవాళీ టోర్నీలో త్రిశతకం చేయడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'పుష్ప' పార్ట్-2 తగ్గేదే లే: అల్లు అర్జున్
    'పుష్ప' సినిమా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని హీరోహీరోయిన్ మధ్య లవ్​ట్రాక్​.. తన నిజజీవితంలో నుంచి స్ఫూర్తితో తెరకెక్కించానని సుకుమార్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.