ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ అల్లుడు

author img

By

Published : Dec 20, 2021, 5:46 PM IST

Shoaib Malik's Nephew: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అల్లుడు మహమ్మద్ హురైరా చరిత్ర సృష్టించాడు. దేశవాళీ టోర్నీలో త్రిశతకం చేయడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Shoaib Malik's Nephew
షోయబ్ మాలిక్ అల్లుడు

Shoaib Malik's Nephew: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అల్లుడు మహమ్మద్ హురైరా చరిత్ర సృష్టించాడు. ఆ దేశం తరఫున త్రిశతకం బాదిన రెండో పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 239 రోజులు) రికార్డు నెలకొల్పాడు. పాక్ దేశవాళీ టోర్నీ క్వాద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా ఈ సాధించాడు.

నార్తర్న్-బెలుచిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో 341 బంతుల్లో 311 పరుగులు చేశాడు హురైరా. ఇందులో 40 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు సెంచరీలు కూడా బాదాడీ యువ క్రికెటర్. ఇది ఇతడికి తొలి దేశవాళీ టోర్నీ కావడం విశేషం.

ఇదీ చదవండి: అలా ఔటయ్యావేంటి బట్లర్.. చూస్కొని ఆడాలిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.