ETV Bharat / state

బట్టబయలైన కాంబోడియా స్కామ్​ - విముక్తి పొందిన విశాఖ యువకులు - Rescued From Cyber Fraud Rackets

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 10:45 PM IST

Indians Rescued From Cyber Fraud Rackets in Cambodia: మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు భారత్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడేలా చేశారని విశాఖ సీపీ తెలిపారు. వివిధ రకాల స్కామ్స్‌ చేయించి విశాఖ నుంచే దాదాపు 120 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన పది మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

Indians Rescued From Cyber Fraud Rackets
Indians Rescued From Cyber Fraud Rackets (ETV Bharat)

Indians Rescued From Cyber Fraud Rackets in Cambodia: కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు. భారతీయులే లక్ష్యంగా సైబర్‌ నేరాలకు పాల్పడటంపై బాధితులకు సదరు ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు. తిరస్కరించినా, ఎదురుతిరిగినా చిత్రహింసలకు గురిచేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది.

విచారణ జరిపిన విశాఖ పోలీసులు కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో కొందరు బాధితులకు విముక్తి కల్పించారు. శుక్రవారం రెండు విమానాల్లో విశాఖ చేరుకున్న 24 మందికి విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.

భవిష్యత్​లో జరగకుండా చర్యలు: ‘విదేశీ వ్యవహారాలశాఖ, భారత రాయబార కార్యాలయం ప్రతినిధుల సహకారంతో బాధితులను క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకున్నాం. తొలి విడతగా ఒక విమానంలో 10 మంది, మరో విమానంలో 14 మంది విశాఖ చేరుకున్నారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ జాయింట్‌ కమిషనర్‌ డా. ఫకీరప్ప నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లు, కాంబోడియా ఏజెంట్లకు మధ్య ఒప్పందాల గురించి విచారణలో తెలుస్తుంది. మొత్తం 70 మంది ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లకు నోటీసులు పంపించాం. నిందితులపై చర్యలు తీసుకుంటాం. చైనా ఏజెంట్లు, వారు కొల్లగొట్టిన డబ్బును పంపిన ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు, సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కాంబోడియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని సీపీ రవిశంకర్‌ తెలిపారు.

చైనా సైబర్‌ ముఠా చేతిలో ఏపీ వాసులు - ముగ్గురిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు - police arrested Human trafficking

మోసం ఎలా చేయాలో శిక్షణ : విశాఖకు చేరుకున్న బాధితుల నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. వాటి ప్రకారం చైనా ఏజెంట్లు తొలుత బాధితుల పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. భారత్‌పై సైబర్‌ నేరాలకు ఎలా పాల్పడాలో 7 నుంచి 10 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఫెడెక్స్‌ కొరియర్, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటనల పేరిట భారతీయులను ఎలా మోసగించాలో నేర్పించారు. ఇప్పటికే విశాఖ సిటీ నుంచి రూ.120 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట విశాఖకు చెందిన మహిళ ఖాతా నుంచి రూ.3.2 కోట్లు కొట్టేశారు.

'యూ ఆర్​ అండర్​ డిజిటల్​ అరెస్ట్​' - అంటే నమ్మకండి! - cyber crimes in AP

భారతీయులను సైబర్‌ ఉచ్చులోకి దింపి నగదు లాగేస్తున్నారు. వాటిని వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. కొందరు ఏడాదిగా, మరొకొందరు ఆరు నెలలు, మూడు నెలలుగా కాంబోడియాలో పనిచేస్తున్నారు. చైనా ఏజెంట్ల వలలో దేశవ్యాప్తంగా 5000 మంది చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 150 మంది, విశాఖకు చెందిన 58 మందిని గుర్తించారు. మరికొంతమంది.. పోలీసులను సంప్రదిస్తున్నారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బట్టబయలైన కంబోడియా స్కామ్​ - విముక్తి పొందిన విశాఖ యువకులు (ETV Bharat)

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల పేరుతో కాంబోడియా తీసుకెళ్లారు. ఒక్కొక్కరి నుంచి రూ. లక్షన్నర తీసుకుని కాంబోడియా పంపించారు. కాంబోడియాలో ఉన్నవాళ్లని చైనా వారికి అప్పగించి భారత్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడేలా చేశారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారు. కొందరు బాధితులను బేస్‌బాల్ బ్యాట్లతో కొట్టారు. ఏపీ నుంచి 150కు పైగా బాధితులు 6 నెలలుగా కాంబోడియాలో ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. -రవిశంకర్‌ అయ్యన్నార్‌, విశాఖ పోలీసు కమిషనర్‌

చీకటి గదుల్లో బంధించి బ్యాట్‌తో కొట్టి : ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో ఉండేవారే లక్ష్యంగా సైబర్‌ మోసాలకు తెగబడ్డారు. తెలుగు వచ్చిన వారు ఆ భాష వారిని లక్ష్యంగా చేసుకోవాలని బాధిత యువకులపై ఏజెంట్లు ఒత్తిడి చేసేవారు. ఆ నేరాలు చేయలేమని నిరసన తెలిపితే చీకటి గదుల్లో బంధించేవారు. భోజనం కూడా పెట్టకుండా తీవ్రంగా హింసించేవారు. బేస్‌బాల్‌ బ్యాట్లతో కొట్టేవారు. పనితీరు సరిగా లేనివారికి, లక్ష్యాన్ని చేరుకోలేనివారికి ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. ఎక్కువ మందిని మోసగిస్తే రెండు పూటలా భోజనం పెట్టేవారు. చైనా ఏజెంట్లను మెప్పిస్తే పార్టీలు, బహుమతులు కూడా ఇచ్చేవారు.

సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్​- 20లక్షల నంబర్లు కట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.