ETV Bharat / bharat

ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. రోజంతా కరెంట్ కట్

author img

By

Published : Dec 28, 2022, 11:00 PM IST

ట్రాన్స్​ఫార్మర్​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజియాబాద్​ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Wires in transformer stolen in Uttar Pradesh
రాగి వైర్లు చోరి చేసిన ట్రాన్స్​ఫార్మర్

దొంగలు చేసిన పనికి ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామం మొత్తం రోజంతా అంధకారంలోకి వెళ్లింది. ట్రాన్స్​ఫార్మర్​ను విప్పదీసి అందు​లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దొంగలు. సోమవారం రాత్రి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్​లో జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాత్రిపూట దొంగలు ట్రాన్స్​ఫార్మర్​ను విప్పదీసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం వరకు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున పొగ రావడం వల్ల.. స్థానికులు దొంగలను గుర్తించలేకపోయారు.

Wires in transformer stolen in Uttar Pradesh
ట్రాన్స్​ఫార్మర్​లో రాగి వైర్లు చోరీ చేసిన దొంగలు
Wires in transformer stolen in Uttar Pradesh
వైర్లు లేని ట్రాన్స్​ఫార్మర్

విప్పదీసిన ట్రాన్సఫార్మర్​ను స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు.. అందులో రాగి వైర్లు చోరికి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విద్యుత్తు శాఖ కొత్త ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేసి, కరెంట్​ సరఫరాను పునరుద్ధరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Wires in transformer stolen in Uttar Pradesh
.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.