ETV Bharat / bharat

లగేజ్​ వ్యాన్​పై ట్యాంకర్ బోల్తా.. 8 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

author img

By

Published : Jul 10, 2023, 5:27 PM IST

Updated : Jul 10, 2023, 6:15 PM IST

Uttar Pradesh Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. లగేజ్​ వ్యాన్​పై.. ఓ ట్యాంకర్ బోల్తా కొట్టడం వల్ల జరిగిందీ దుర్ఘటన.

Uttar Pradesh Accident Today
Uttar Pradesh Accident Today

Uttar Pradesh Accident Today : ఓ ట్యాంకర్.. లగేజ్​ వ్యాన్​పై బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో సోమవారం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రతాప్​గఢ్​ మెడికల్ కాలేజీకి తరలించారు.

15 మంది ప్రయాణికులతో ఓ లగేజీ వ్యాన్​ ప్రతాప్​గఢ్​ వైపు వెళ్తోంది. అదే సమయంలో ఓ ట్యాంకర్​ మోహన్​గంజ్​ నుంచి వస్తోంది. ఇంతలో ఆ ట్యాంకర్ అదుపుతప్పి లగేజీ వ్యాన్​పై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లగేజీ వ్యాన్​లో ఉన్న 8 మంది మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పోలీసులు.. ప్రతాప్​గఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

యోగి పరిహారం..
మరోవైపు.. ప్రతాప్​గఢ్ రోడ్డు ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు.. రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

  • #UPCM @myogiadityanath ने जनपद प्रतापगढ़ में सड़क हादसे में हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है। मुख्यमंत्री जी ने दिवंगतों की आत्मा की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।

    मुख्यमंत्री जी ने मृतकों के परिजनों को ₹02-02 लाख एवं गंभीर घायलों…

    — CM Office, GoUP (@CMOfficeUP) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోయలో పడిపోయిన వాహనం..
మరోవైపు.. హిమాచల్​ప్రదేశ్​లో ఓ వాహనం లోయలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. కులూ జిల్లాలోని రాంపుర్-కేదాస్ లింక్ రోడ్డుపై సోమవారం జరిగిందీ ప్రమాదం. మృతులను హర్ద్యాల్ (65), రంజన (47), వర్ష, నారాయణ శర్మగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Haryana Road Accident : రెండు రోజుల క్రితం హరియాణాలో ఆర్టీసీ బస్సు - వ్యాన్​ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బీబీపుర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగింది ఇలా..
హరియాణాలోని జింద్​ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు జింద్ బస్టాండ్​ నుంచి బయళ్దేరిన ఆర్టీసీ బస్సు.. బీబీపుర్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన క్రూయిజర్ (తుపాన్ ప్యాసింజర్ వాహనం)ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వ్యాన్​ ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను క్రుయిజర్​లో గుర్తించినట్లు సమాచారం. కాగా మృతులు అందరూ క్రుయిజర్​లో ప్రయాణిస్తున్న వారే. బస్సు డ్రైవర్​ సైతం ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఘటనా స్థలికి వెంటనే ఆరు అంబులెన్స్​లు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Jul 10, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.