ETV Bharat / bharat

నవమి రోజున జాక్​పాట్​.. ఒక్క వజ్రంతో రాత్రికిరాత్రే లక్షాధికారిగా..

author img

By

Published : Oct 5, 2022, 10:06 AM IST

దసరా వేళ ఓ వ్యక్తి పంట పండింది. ఓ విలువైన వజ్రం అతడ్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో ఆ కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు.

.
.

భారతదేశంలోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. నవమి రోజున దొరికిన ఈ అరుదైన వజ్రం నొయిడాకు చెందిన రాణా ప్రతాప్​ను​ రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. పన్నా గనుల్లో మరో అరుదైన వజ్రం తమ గనిలో దొరికిందని గని యజమాని సంబరాలు చేసుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో నివాసముంటున్న రాణా ప్రతాప్​ తన భార్య పేరుతో మధ్యప్రదేశ్​లోని సిరస్వాహాలోని భర్కా గని ప్రాంతంలో ఓ మైన్ లీజుకు తీసుకున్నారు. ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతుండగా.. నవమి రోజున(మంగళవారం) అతనికి 9.64 క్యారెట్ల నాణ్యమైన వజ్రం ఒకటి దొరికింది. అంతటి విలువైన వజ్రం తమకు దొరికినందుకు రాణా ప్రతాప్​ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసినట్లు తెలిపాడు రాణా ప్రతాప్.

పన్నాలో దొరికే వజ్రాల గురించి తన స్నేహితులు చెప్పగా అక్కడ ఓ గనిని లీజుకు తీసుకున్నానని, ఎప్పటికన్నా తనని అదృష్టం వరిస్తుందని అప్పుడే అనుకున్నానని రాణా ప్రతాప్​ అన్నాడు. ఈ వజ్రం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. దీన్ని రానున్న డైమండ్​ ఆక్షన్​లో ఉంచనున్నట్లు తెలిపిన రాణా ప్రతాప్​.. వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంతభాగం పేద పిల్లల సహాయం కోసం ఖర్చు చేస్తానని అన్నాడు. మరో పెద్ద గనిని లీజుకు తీసుకుని, తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు.

ఇదీ చదవండి: పోలీస్ హత్యకు రెండు రోజుల్లోనే రివెంజ్- నలుగురు ఉగ్రవాదులు హతం

సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా.. 105 ప్రదేశాల్లో సోదాలు.. ఇంటర్​పోల్ సమాచారంతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.