ETV Bharat / bharat

గుజరాత్​ తీగల వంతెన ఘటనలో.. మోర్బీ మున్సిపల్​ అధికారి సస్పెండ్​

author img

By

Published : Nov 4, 2022, 12:51 PM IST

మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి గుజరాత్​ ప్రభుత్వం ఓ అధికారిని సస్పెండ్​ చేసింది. ఈ విషయాన్ని మోర్బీ జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

gujarat-bridge-collapse-official-suspension
మోర్బీ మున్సిపల్​ అధికారి సస్పెండ్

మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి.. గుజరాత్‌ ప్రభుత్వం మోర్బీ మున్సిపాలిటీ ముఖ్య అధికారి సందీప్‌ సిన్హా జాలాను సస్పెండ్‌ చేసింది. ఈ విషయాన్ని మోర్బీ జిల్లా కలెక్టర్‌ జీటీ పాండ్యా శుక్రవారం తెలిపారు.
తీగల వంతెన కాంట్రాక్ట్‌ను 15 ఏళ్లపాటు ఒరెేవా గ్రూప్‌నకు మోర్బీ మున్సిపాలిటీ అప్పగించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒరేవా గ్రూప్‌నకు చెందిన నలుగురు ఉద్యోగులు సహా 9 మందిని అరెస్ట్‌ చేశారు.

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఆదివారం కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 135 మంది మరణించారు. మచ్చూ నదిపై ఉన్న ఈ కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. అంతకుముందు.. వంతెనకు ఏడు నెలల పాటు మరమ్మతులు నిర్వహించారు. రిపేర్లు పూర్తై.. వంతెన తెరిచిన నాలుగోరోజే ఈ దుర్ఘటన జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.