LIVE : బీజేపీ అభ్యర్థుల నామపత్రాల దాఖలు కార్యక్రమం - lok sabha elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 10:09 AM IST

Updated : Apr 18, 2024, 10:20 AM IST

thumbnail

Telangana BJP candidates nominations Live : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంటులో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఈనెల 25 వరకు  రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహించి  దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్లతో పాటు కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4న చేస్తారు.  నామినేషన్ల తొలిరోజు నుంచే బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగారు. రఘునందనరావు, ఈటల రాజేందర్, డి.కె. అరుణ ఇవాళ వారి వారి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇందుకు హాజరయ్యారు. ర్యాలీలు, సభలతో అట్టహాసంగా నామపత్రాల దాఖలు కార్యక్రమం ఘనంగా సాగుతోంది.

Last Updated : Apr 18, 2024, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.