రోడ్డు ప్రమాదంలో మున్సిపల్​ ఒప్పంద ఉద్యోగి మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 11:34 AM IST

thumbnail

Road Accident in Anantapur District : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతకల్లు మున్సిపాలిటీలో వాటర్​మెన్​గా పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగి శివానంద (49) గురువారం రాత్రి ద్వి చక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. శివానంద తన సోదరితో కలిసి ద్విచక్రవాహంపై ఆమె స్వగ్రామానికి బయల్దేరాడు. వజ్రకరూరు మండల కేంద్రం సమీపంలో మారెమ్మ ఆలయం మలుపు వద్ద ఎదురుగా కట్టెల లోడుతో వచ్చిన ట్రాక్టర్​ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివానందకు తీవ్ర గాయాలు కాగా అతని చెల్లికి స్వల్ప గాయాలయ్యాయి. 

Waterman in Guntakallu Municipality Who Died in the Accident : గాయపడిన వీరిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే శివానంద మరణించినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రి ప్రాంగణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.