ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి సీఎం రేవంత్‌ గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నారు : అర్వింద్‌ - MP Arvind on CM Revanth

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 7:41 PM IST

thumbnail

MP Arvind Fire on CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి గాడిద పట్టుకుని తిరుగుతున్నారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన​ స్పందించారు. ఈ మేరకు ఇవాళ నిజామాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి అర్వింద్‌ మాట్లాడారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడిన భాషను ఎంపీ అర్వింద్‌ తప్పుబట్టారు. ఓ వైపు ప్రధాని మోదీ దేశం కోసం కష్టపడుతుంటే, కాంగ్రెస్‌ నాయకులు గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్​రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లను తీసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని ఇప్పటికే మోదీ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే గుజరాత్​ నుంచి వచ్చారని సీఎం రేవంత్​ అంటున్నారని, మరి ఆయన పాలమూరు నుంచి వచ్చారా అని ప్రశ్నించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.