కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయి : జగదీశ్ రెడ్డి - Jagadeesh Reddy Fires On BJP Cong

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 8:48 PM IST

thumbnail

Jagadish Reddy Fires On BJP Congress : కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను వదులుకుని తప్పుచేశామనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు. కాంగ్రెస్ అసత్య వాగ్దానాలకు మోసపోయామని ప్రజలు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కంచర్ల కృష్ణారెడ్డికి మద్ధతుగా పార్టీశ్రేణులతో కలిసి జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.  

కొత్త పథకాలను ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చినవీ కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కనపెట్టి సంబంధంలేని అంశాలతో బీజేపీ, కాంగ్రెస్‌లు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా లోని నల్గొండ, భువనగిరి రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపు బీఆర్‌ఎస్‌ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.