LIVE : నారాయణపేటలో కాంగ్రెస్ జన జాతర సభ - ప్రత్యక్షప్రసారం - congress jana jathara sabha

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 6:55 PM IST

Updated : Apr 15, 2024, 8:35 PM IST

thumbnail

Congress Jana Jathara sabha Narayanpet : రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కాంగ్రెస్​ పార్టీ తమ ప్రచార వేగాన్ని పెంచింది. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన తుక్కుగూడ జనజాతర సభ విజయంవంతం కావడంతో, కాంగ్రెస్ శ్రేణులు రెట్టింపైన ఉత్సహంతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ, కర్ణాటక అత్యంత ముఖ్యమని కాంగ్రెస్‌ భావిస్తోంది. పార్టీ అధిక లోక్‌సభ స్థానాలు నెగ్గే రాష్ట్రాల్లో ఆ రెండు రాష్ట్రాలు ముందుంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17లో 14 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Last Updated : Apr 15, 2024, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.