ETV Bharat / state

అదుపుతప్పి టిఫిన్​బండిపైకి దూసుకెళ్లిన బస్సు - ముగ్గురి మృతి - 3 People Died In Road Accident

author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 10:58 PM IST

3 People Died In Road Accident : ఓటు వేయడానికి సొంత ఊరుకు వెళ్తున్నామనే ఆ కుటుంబ సభ్యుల ఆనందం క్షణాల్లోనే ఆవిరయ్యింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. రహదారి పక్కన టిఫిన్​ చేస్తున్న ముగ్గురుపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన బస్సు వారి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన హైదరాబాద్​ - వరంగల్​ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లిలో జరిగింది.

3 People Died In Road Accident
3 People Died In Road Accident (ETV Bharat)

3 People Died In Road Accident : ఓటు వేయడానికి సొంతూరికి వెళ్తూ మార్గ మధ్యలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్​ - వరంగల్​ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లిలో జరిగింది. రహదారి పక్కన భార్యాభర్తలు తమ కుమారునితో కలిసి టిఫిన్ చేస్తున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు టిఫిన్​ బండిపైకి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

అసలేం జరిగిందంటే?
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ ఎస్​ఆర్​ఆర్ తోటకు చెందిన తెలుకలపల్లి రవీందర్(38) బతుకుతెరువు కోసం బీబీనగర్​కు వలసవెళ్లి పాత సామాగ్రి వ్యాపారం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు చిన్న సమ్మయ్య, భాగ్యమ్మ వరంగల్​లోనే ఉంటున్నారు. రవీందర్​కు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పెద్ద కుమారుడు పార్థు(12)ను వారివద్దకు పంపించారు. ఓటు వేసి తన కుమారుడిని ఇంటికి తీసుకువద్దామని భార్య, చిన్న కుమారుడితో స్కూటిపై బీబీనగర్​ నుంచి వరంగల్​ నుంచి బీబీనగర్​ బయలు దేరారు. మార్గమధ్యలో బంక్​ పక్కన ఉన్న టిఫిన్​ సెంటర్​ వద్ద కూర్చుని అల్పాహారం తింటుండగా ప్రమాదం జరిగింది.

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం! - RTC Bus Accident in kothagudem Dist

Road Accident In Jangaon District : సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న వరంగల్​ ఆర్టీసీ డిపో-1 కు చెందిన రాజధాని ఎక్స్​ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న టిఫిన్​ సెంటర్​పైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో రవీందర్​ భార్య జ్యోతి(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవీందర్​, అతని చిన్నకుమారునికి తీవ్రగాయాలయ్యాయి. రవీందర్​ అతని చిన్నకుమారుడు భవీష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

దీంతో పెద్ద కుమారుడు పార్ధు తల్లిదండ్రులు లేని అనాథగా మారాడు. ఈ విషయం అందరినీ కలచి వేసింది. ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుల కుటుంబం సభ్యులు రుణావత్ నవీన్, శ్రీకాంత్, రాకేష్, వాహన చోదకుడు కేతావత్ గణేష్​కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన బస్సును, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా - ముగ్గురు మృతి - వివాహం ఆగిపోయిందని వరుడి తాత ఆత్మహత్య - 3 PEOPLE DIED IN ROAD ACCIDENT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.