ETV Bharat / state

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 1:48 PM IST

Updated : Mar 3, 2024, 3:41 PM IST

Medigadda Barrage News Latest : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వం వహించనున్నారు. ఈ మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును పరిశీలించించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ కమిటీని నియమించింది. ఛైర్మన్​తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు.

Medigadda Barrage
Medigadda Barrage

Medigadda Barrage News Latest : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు కారణాలు విశ్లేషించి, తగిన సిఫార్సులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్​డీఎస్​ఏ ఆదేశాలు జారీ చేసింది.

కమిటిలో మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు. సెంట్రల్​ సాయిల్​ అండ్​ రీసెర్చ్​ స్టేషన్​ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ శాస్త్రవేత్త ఆర్​ పాటిల్​, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్​ శర్మ, రాహుల్​ కుమార్ సింగ్​ ఉన్నారు. ఎన్​డీఎస్​ఏ టెక్నికల్​ డైరెక్టర్​ అమితాబ్​ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై సమగ్ర అధ్యయనం, తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్​డీఎస్​ఏ కమిటీని ఏర్పాటు చేసింది.

Medigadda Barrage Issue : మేడిగడ్డ, అన్నారం(Annaram Barrage), సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి స్టేక్​ హోల్డర్స్​తో చర్చించి నిర్మాణం ప్రాంత అంశాలు, హైడ్రాలిక్​, స్ట్రక్చరల్​, జియో టెక్నికల్​ అంశాలను పరిశీలించాలని కమిటీకి ఎన్​డీఎస్​ఏ సూచించింది. ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్​, డిజైన్​ మెమోరండా, సైట్​ ఇన్వెస్టిగేషన్​ రిపోర్ట్స్​, బ్యారేజ్​ ఇన్​స్పెక్షన్​ రిపోర్ట్స్​, మెటీరియల్​, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్​ తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని తెలిపింది. ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, నిర్వహణలో భాగస్వాములైన ప్రభుత్వ, సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు, స్టేక్ హోల్డర్స్​తో చర్చించాలని కమిటీకి సూచించింది.

డ్రాయింగ్​లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం

నాలుగు నెలల్లోపు నివేదిక : మూడు ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మేథమెటికల్ మోడల్ స్టడీస్(Mathematical Model Study)​ను పరిశీలించాలని పేర్కొంది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుతో ఇతర అంశాలకు కారణాలను కమిటీ పరిశీలించాలని ఎన్​డీఎస్​ఏ తెలిపింది. ఎగువన ఉన్న రెండు ఆనకట్టల్లో గమనించిన లోపాలకు గల కారణాలను కూడా పరిశీలించాలి. మూడు ఆనకట్టల విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్​లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ నాలుగు నెలల లోపు నివేదిక ఇవ్వాలని ఎన్​డీఎస్​ఏ గడువు నిర్దేశించింది.

మేడిగడ్డపై మరింత లోతుగా విజిలెన్స్ విచారణ - మెజర్​మెంట్​ బుక్​ నిర్వాకంపై ప్రత్యేక దృష్టి

సర్వే చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పు : కేంద్ర జల్​ శక్తి మంత్రి సలహాదారు

Last Updated :Mar 3, 2024, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.